పట్టలేనంత ఆనందంలో లక్ష్మి మంచు

పట్టలేనంత ఆనందంలో లక్ష్మి మంచు

Published on Mar 13, 2013 8:20 PM IST

Lakshmi-Manchu
తన తాజా చిత్రం ‘గుండెల్లో గోదారి’ ఆంధ్ర ప్రదేశ్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుందడంతో లక్ష్మీ మంచు ఈ మధ్యన చాలా ఆనందంగా కనబడుతుంది. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లక్ష్మి మంచు, తాప్సీ, ఆది,సందీప్ కిషన్ నటించారు. ముఖ్య తారాగణం నటనతో పాటు వరద సన్నివేశాల చిత్రీకరణ, పళని సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతానికి మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం మొత్తం ఈ ఉదయం హైదరాబాద్ లో జరిగిన ఒక మీడియా సమావేశం లో పాల్గొన్నారు.

ఈ చిత్రానికి వచ్చిన స్పందన గురించి లక్ష్మి మాట్లాడుతూ “ఈ చిత్ర విడుదలకు ముందు చాలా భయపడ్డాను. మా నాన్నగారు(మోహన్ బాబు)నాకు కొంచం ధన సహాయం చేస్తానన్నారు కాని నేను అంతా స్వయంగా చెయ్యాలని చాలా పట్టుదలగా వున్నాను. ఒక సందర్భం లో నా దగ్గర వున్న డబ్బులు అన్ని అయిపోయాయి మళ్ళి నేను తిరిగి సంపాదించుకోగలనో లేదో అన్న అనుమానం కలిగింది. మా తమ్ముడు మంచు మనోజ్ ఆ సమయం లో నాకు చాల మద్దతు ఇచ్చాడు. భయపడ్దోదు అని చెప్తూ వుండేవాడు. ఈ రోజు ఈ చిత్రానికి వచ్చిన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. నేను ఈ చిత్రం 100 ధియేటర్లలో 40%
ప్రేక్షకులు వున్నా చాలా ఆనందపడేదాన్ని కాని దగ్గర దగ్గరగా 250 ధియేటర్లలో విడుదలయ్యి చాలా మంచి ప్రజాదారణతో ప్రదర్శింపబడడం చాలా ఆనందంగా వుంది . నా అప్పులు అన్నీ తీర్చి డబ్బులు రాబట్టుకోగాలనని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చిత్రం తమిళనాడు విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. “.ఈ చిత్రం తమిళంలో ‘మరంతేన్ మన్నితేన్’ పేరుతో మార్చ్ 22 న విడుదల అవ్వబోతుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు