తెలుగు సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు అంతిమయాత్ర మొదలైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రాళ్లపల్లి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాళ్లపల్లిని కడసారి చూసుకునేందుకు తరలివచ్చారు.
శ్వాసకోస వ్యాధితో బాధపడుతోన్న రాళ్లపల్లి, మాదాపూర్లోని మ్యాక్స్క్యూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న కూతురు, అల్లుడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.