ధోనీ తోలి ప్రొడక్షన్ కి హీరో హీరోయిన్ ఫిక్స్!

ధోనీ తోలి ప్రొడక్షన్ కి హీరో హీరోయిన్ ఫిక్స్!

Published on Oct 26, 2022 10:15 AM IST


టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంటర్ టైన్మెంట్ రంగం లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ధోనీ ఎంటర్ టైన్మెంట్ అంటూ తన బ్యానర్ ను ప్రకటించారు. తన తొలి ప్రొడక్షన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు రమేష్ తమిళమణి ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ నుండి రావాల్సి ఉంది. తొలి ప్రాజెక్ట్ ను భారతదేశం లోని ప్రధాన బాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చేరనున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు