అక్కినేని అభిమానులకు చిరస్మరణీయమైన వేడుక

అక్కినేని అభిమానులకు చిరస్మరణీయమైన వేడుక

Published on Jul 20, 2026 3:19 PM IST

అఖిల్ అక్కినేని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజయాన్ని ‘లెనిన్’ చిత్రం ద్వారా సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మరో విజయోత్సవ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరు కానుండటం విశేషం. అక్కినేని నాగార్జున, అఖిల్ మరియు నాగ చైతన్య చాలా కాలం తర్వాత ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దీంతో, ఈ వేడుక అక్కినేని అభిమానులకు ఒక చిరస్మరణీయమైన వేడుక కానుంది.

ఇకపై ఈ చిత్రం తన థియేట్రికల్ ప్రయాణాన్ని ఎంత విజయవంతంగా కొనసాగిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సునీల్, బ్రహ్మాజీ, శివాజీ మరియు ఈశ్వరీ రావు వంటి సహాయ నటీనటులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మొత్తానికి ఈ సినిమా పై అఖిల్ పెట్టుకున్న హోప్స్ నిజం అయ్యాయి. ఈ సినిమాకు థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. మ్యూజిక్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు