‘మహానటి’ని విశేషంగా ఆదరిస్తున్న నైజాం ప్రేక్షకులు !

సావిత్రిగారి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం ‘మహానటి’. తొలిరోజు నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోను మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా నైజాం ప్రేక్షకులైతే సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ ఎంతలా ఉందంటే ఆరంభంలో ఉన్న వసూళ్ల కంటే ఇప్పుడు నమోదవుతున్న వసూళ్లే అధికంగా ఉన్నాయి.

11వ రోజు రూ.67.26 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత 12వ రోజు ఆదివారం ఇంకాస్త మెరుగుపడి రూ.81.70 లక్షల షేర్ ను అందుకుని మొత్తంగా 12 రోజులకు కలిపి రూ.7.86 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఈ కలెక్షన్ల జోరు చూస్తుంటే చిత్రం ఫుల్ రన్ పూర్తయ్యేనాటికి ముందుగా ఊహించిన మొత్తానికంటే ఎక్కువగ మొత్తాన్నే రాబట్టేలా కనిపిస్తోంది.

Exit mobile version