అక్కినేని హీరో సుమంత్ త్వరలోనే ‘మహేంద్రగిరి వారాహి’ అనే మిస్టికల్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్నుటీజర్ టాక్ : ‘మహేంద్రగిరి వారాహి’తో సుమంత్ హిట్ ఖాయం..? మేకర్స్ విడుదల చేయగా, ఇది ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ టీజర్ వారాహి దేవి శాపానికి గురైన ఒక వంశం యొక్క బ్యాక్స్టోరీతో ప్రారంభమవుతుంది. ఆ శాపం ప్రకారం, ఆ వంశంలో జన్మించిన ఏ మగపిల్లాడు కూడా 33 ఏళ్ల వయసు దాటి బతకలేడు. సంవత్సరాల తర్వాత, మహేంద్రగిరిలో కొన్ని రహస్య మరణాలు సంభవిస్తాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఆ మిస్టరీని ఛేదించడానికి సుమంత్ అక్కడకు చేరుకుంటాడు.
సినిమా నుండి ప్రేక్షకులు ఏం ఆశించవచ్చో అర్థమయ్యేలా ఈ బ్యాక్స్టోరీని టీజర్లోనే చాలా చక్కగా వివరించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ కథానాయికలుగా నటిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై మధు కాలిపు, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


