సర్కారు వారి పాట తరువాత రాజమౌళితో కాదట..!

సర్కారు వారి పాట తరువాత రాజమౌళితో కాదట..!

Published on Jun 6, 2020 9:00 AM IST

ఏస్ డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన చేయబోయే చిత్రం మహేష్ తో ఉంటుందని, ఆయన స్పష్టత ఇచ్చారు. లాక్ డౌన్ పరిస్థితులు అంతకంతకు ఆర్ ఆర్ ఆర్ లేటయ్యేలా చేస్తున్నాయి. భారీ సెట్స్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినా… అవుట్ డోర్ షూటింగ్ ఎలా పూర్తి చేస్తారన్నది అర్థం కావడం లేదు. దీనితో ఆర్ ఆర్ ఆర్ మూవీ మరింత లేటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

దీనితో రాజమౌళి మూవీ మొదలయ్యే లోపు మహేష్ మరో సినిమా చేసుకోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండు మూడు నెలలలో పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ మొదలుకానుంది. ఆ సినిమా 2021 సమ్మర్ తరువాత విడుదలయ్యే సూచనలు కలవు. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన వెంటనే రాజమౌళి మహేష్ మూవీ మొదలుపెట్టడు. కథా, స్క్రిప్ట్ లొకేషన్స్, క్యాస్టింగ్ ఇలా అనేక విషయాలు ఉంటాయి. కాబట్టి వీరి మూవీ మొదలుకావడని కనీసం రెండేళ్లు పడుతుంది. కాబట్టి మహేష్ రెండు చిత్రాలు చేస్తాడు అనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు