సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహేష్ బాబు కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచిన బ్లాక్బస్టర్ మూవీ ‘పోకిరి’ రీ-రిలీజ్ కాబోతోంది.
అయితే ఈసారి కేవలం సాధారణ రీ-రిలీజ్ షోలు మాత్రమే కాకుండా, రీ-రిలీజ్ చిత్రాల చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 9వ తేదీన స్పెషల్ మిడ్నైట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఓ రీ-రిలీజ్ చిత్రానికి కూడా మిడ్ నైట్ షోలు పడటం చాలా అరుదు.
సాధారణంగా పెద్ద హీరోల కొత్త సినిమాలకు మాత్రమే ఉండే ఈ అర్ధరాత్రి షోల హడావుడిని, ఇప్పుడు ఒక రీ-రిలీజ్ సినిమాకు ప్లాన్ చేయడం సరికొత్త ట్రెండ్కు తెరలేపింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ సినిమా అంటే మహేష్ ఫ్యాన్స్కు ఎప్పటికీ పూనకాలే. మరి ఆగస్టు 9న థియేటర్లలో పండగ చేసుకోవడానికి, పాత రికార్డులను తిరగరాయడానికి సూపర్ స్టార్ అభిమానులు ఇప్పుడే సిద్ధమైపోతున్నారు.
