విజయశాంతి పై మహేష్ లేటెస్ట్ పోస్ట్ !

విజయశాంతి పై మహేష్ లేటెస్ట్ పోస్ట్ !

Published on Sep 13, 2019 1:06 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే గతంలో విజయశాంతితో కలిసి మహేష్ కొడుకు దిద్దిన కాపురం సినిమాలో నటించాడు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ తాజగా మహేష్ ఒక పోస్ట్ పెట్టాడు. ‘1989లో దాదాపుగా 30 ఏళ్ళ క్రితం కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతిగారితో కలిసి నటించాను. మళ్లీ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమెతో కలిసి నటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ మహేష్ పోస్ట్ చేసారు.

కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు