టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు రాజమౌళి
డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్తో కనిపిస్తున్నాడు. ఇక మహేష్ బాబు అభిమానుల కోసం ఓ సర్ప్రైజ్ మూవీ రీ-రిలీజ్ కు రెడీ అయ్యింది.
లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మహేష్ బాబు నటించిన ‘అతిథి’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో అమృత రావు హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా నిలిచింది.
అయితే, తమ హీరో సినిమాను రీ-రిలీజ్ చేసుకుని చూసేందుకు మహేష్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. దీంతో ‘అతిథి’ చిత్రం రీ-రిలీజ్లో ఎలాంటి సక్సెస్ సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.