మార్చి 24 నుండి మరలా షూటింగ్ లో పాల్గొనున్న మహేష్

మార్చి 24 నుండి మరలా షూటింగ్ లో పాల్గొనున్న మహేష్

Published on Mar 21, 2013 3:59 AM IST

mahesh-babu
మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ మార్చి24 నుండి తిరిగి ప్రారబించనున్నారు. ఈ షెడ్యూల్ మార్చి 18నుండే మొదలుకావాల్సివుంది, అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు కారణంగా ఆలస్యం అయింది. ఈ కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్లో 10 రోజులు చిత్రీకరించి ఆ తరువాత ముఖ్యమైన షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు. కృతి సనన్ ఈ సినిమాతో హీరొయిన్ గా పరిచయం కానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరచనున్నడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రామ్ ఆచంట మరియు అనీల్ సుంకర 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు