ఎన్.టి.ఆర్ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్

ఎన్.టి.ఆర్ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్

Published on Mar 20, 2013 4:04 PM IST

NTR-and-Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మంచి ఫ్రెండ్స్. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఇది నిజం. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల మహేష్ బాబు ఎన్.టి.ఆర్ నటించిన ‘బాద్షా’ సినిమాకి వాయిస్ ఓవర్ అందించడానికి అంగీకరించాడు. అలాగే డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా మహేష్ బాబుకి చాలా మంచి ఫ్రెండ్. వాయిస్ ఓవర్ కి సంబందించిన మహేష్ బాబు డబ్బింగ్ ఈ రోజు గానీ లేక రేపు గాని జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ‘బాద్షా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ ఆల్బం ఇప్పటికే హిట్ అయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు