పల్లెటూరి నేపథ్యంలో ‘మహేశ్’ ?

పల్లెటూరి నేపథ్యంలో ‘మహేశ్’ ?

Published on Jun 2, 2019 12:58 PM IST

‘గీత గోవిందం’తో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల రూపాయల భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘గీత గోవిందం’. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కాగా ప్రస్తుతం పరుశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరుశు రామ్ ఇప్పటికే మహేశ్ కి ఒక లైన్ చెప్పాడు. లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మహేశ్ కూడా స్క్రిప్ట్ వర్క్ చేసుకోని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం పరుశురామ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కాగా సినిమా మొత్తం పక్కా పల్లెటూరి నేపథ్యంలో ఉంటుందట. సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎనభై నాటి కాలంలో జరుగుతుందని.. ఆ ప్లాష్ బ్యాక్ సన్నివేశాలన్నీ ఎమోషనల్ గా సాగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు