పూరి కథ మహేష్ కి నచ్చిందట !

పూరి కథ మహేష్ కి నచ్చిందట !

Published on Nov 23, 2020 8:10 PM IST

పూరి మదిలో వున్న ‘జనగనమణ’ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసి, పూరి మహేష్ కి వినిపించాలనుకుంటున్నాడని.. ఆ మధ్య బాగా వార్తలు వినిపించాయి. నిజానికి అప్పట్లోనే మహేష్ బాబుకు పూరి ఈ కథను వినిపించాడు. అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని వస్తా అని చెప్పిన పూరి, ఆ తరువాత మళ్ళీ ఆ కథ మీద కూర్చోలేదు. అయితే ఈ లాక్ డౌన్ లో స్క్రిప్ట్ పూర్తి చేసినా పూరి.. ఇప్పటికే మహేష్ కి కథ వినిపించాడట.

కాగా మహేష్ కి కథ బాగా నచ్చిందని వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పూరి కథ చెబితే వింటానని చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్లుగానే పూరి కూడా రెడీ అయి మొత్తానికి కథను చెప్పి ఒప్పించాడు. అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట.

ఇక ఈ కరోనా టైమ్ లో సినిమా దర్శకులుకు కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం.. అందుకే ఇప్పటికే చాలామంది దర్శకులు తమ తరువాత సినిమాల కథలను పూర్తి చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు