మహేశ్ ‘మహర్షి’ నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కాగా తాజాగా దేవి శ్రీ ప్రసాద్ మహర్షి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీను తన ట్వీటర్ వేడుకగా వెల్లడించారు. మార్చి 29వ తేదీన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తోన్నట్లు ఆయన పోస్ట్ చేశారు.

ఇక మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version