రేపటి నుండి షూటింగ్లో పాల్గొననున్న మహేష్ బాబు !

రేపటి నుండి షూటింగ్లో పాల్గొననున్న మహేష్ బాబు !

Published on Jun 17, 2018 8:09 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సిల్వర్ జూబ్లీ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ రేపటి నుండి హిల్ స్టేషన్ డెహ్రాడూన్ లో మొదలుకానుంది. మహేష్ బాబు ఈ షూటింగ్ కోసం ఈరోజే డెహ్రాడూన్ బయలుదేరి వెళ్లారు. రేపటి నుండి ఆయన చిత్రీకరణలో పాల్గొననున్నారు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ పాత్రలో కనిపిస్తారనే టాక్ కూడ వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు