ఎన్టీఆర్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ కి అన్ని కోట్లా?

ఎన్టీఆర్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ కి అన్ని కోట్లా?

Published on May 20, 2020 8:43 AM IST


ఎన్టీఆర్ తన 31వ చిత్రం కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ పూర్తి చేసిన వెంటనే ప్రశాంత్ నీల్ తో మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం కెజిఫ్ 2 పనులలో బిజీగా ఉండగా ఈ ఏడాది చివరికి కానీ ఫ్రీ కాడు. 2021 మధ్యలో లేదా చివర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

ఐతే ఈ చిత్రం కోసం ప్రశాంత్ రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాక్ కావలసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ ఏకంగా 17కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అలాగే రెండు కోట్ల రూపాయల వరకు నిర్మాతలు అడ్వాన్స్ గా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దర్శకుడికే ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేసిన నిర్మాతలు హీరో ఎన్టీఆర్ కి ఎంత ఇవ్వనున్నారో. ఇక ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు