అక్కినేని వంశం అంతాకలిసి తెరకెక్కించిన ‘మనం’ సినిమా మరియు అయోధ్య కుమార్ ‘మిణుగురులు’ సినిమాలు ఇండియా తరుపునుండి ఉత్తమ పరభాషా చిత్రాల కేటగిరిలో ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం మనకు తెలిసినదే
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాలను ఎంపిక చేసే కమిటీ హిందీ చిత్రమైన ‘లైయర్స్ డైస్’ సినిమాను తదుపరి లెవల్ కు పంపినట్టు తెలిసింది. ఈ సినిమాలో గీతాంజలి తాపా, నవాజుద్ధీన్ సిద్దికీ వంటి నటులు నటించారు. ‘లైయర్స్ డైస్’ సినిమా బృందానికి 123తెలుగు ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం


