
అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మనం’. ఆడియన్స్ ఈ సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి విక్రం కుమార్ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో శ్రియ సరన్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జూలై 19 నుంచి మొదలవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాతో నాగ చైతన్య – సమంత మూడోసారి కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య – సమంతల కెమిస్ట్రీ, అలాగే నాగార్జున – శ్రియల కెమిస్ట్రీ హైలైట్ అవుతుందని అంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ రాస్తున్నాడు.
త్వరలో మొదలు కానున్న మనం సెకండ్ షెడ్యూల్
త్వరలో మొదలు కానున్న మనం సెకండ్ షెడ్యూల్
Published on Jun 30, 2013 12:20 PM IST
సంబంధిత సమాచారం
- కార్తీ సినిమా కోసం మరో డైరెక్టర్.. అయితే..!
- సాయి పల్లవి మూవీ ఫ్లాప్.. ఆ స్టార్ హీరో ఒప్పుకున్నాడట..!
- విడాకుల బాటలో ‘విశ్వంభర’ బ్యూటీ..?
- అక్షయ్ కుమార్తో దిల్ రాజు సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..!
- ‘రామాయణ’ షూటింగ్లో జాయిన్ అయిన రకుల్.. ఆ పాత్ర కోసమే..!
- కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో లోకేష్ ‘DC’ ట్రైలర్.. ఎప్పుడంటే..?
- ‘పెద్ది’ రెండు వెర్షన్లూ ‘ధురంధర్’ మేకర్స్ తోనే.!
- సూర్య ‘కరుప్పు’ చిత్రానికి సీఎం విజయ్ బూస్ట్..!
- నైజాంలో ‘పెద్ది’కి షాక్.. టికెట్ రేట్లు పెంచబోమంటున్న ఎగ్జిబిటర్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
- నార్త్లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్తో విధ్వంసం..!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- మరో క్రేజీ ప్రాజెక్ట్కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం అలరించే వినోదాలివే !
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!

