మన్మధుడు 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ !

మన్మధుడు 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ !

Published on Jan 20, 2019 3:15 PM IST

కింగ్ నాగార్జున కెరీర్ లో గుర్తిండిపోయే చిత్రాల్లో ‘మన్మధుడు’ చిత్రం కూడా ఒకటి. 2002 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి ఎన్ని సార్లు చూసిన కొత్తగానే అనిపిస్తుంది. ఇక ఈచిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఇటీవలే నాగ్ ప్రకటించారు.

‘చి ల సౌ’ చిత్రం తో మెప్పించిన యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవలే ‘మన్మధుడు 2’ స్క్రిప్ట్ ని నాగ్ కు వినిపించాడట రాహుల్. స్క్రిప్ట్ విన్న నాగ్ ఎగ్సైట్ అయ్యి వెంటనే సినిమాకు ఓకే చెప్పడని టాక్. కొద్దీ రోజుల్లో ఈచిత్రం లో నాగ్ కు జోడిగా నటించే హీరోయిన్ పేరును ప్రకటించనున్నారు. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు