మెహ్రీన్ ఆశలన్నీ ‘పంతం’ మీదే !

మెహ్రీన్ ఆశలన్నీ ‘పంతం’ మీదే !

Published on Jun 20, 2018 12:46 PM IST

గతేడాది ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్’ వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిన మెహ్రీన్ అదే ఏడాది ‘కేరాఫ్ సూర్య, జవాన్’ లాంటి పరాజయాల్ని కూడ చవిచూశారు. ఈ రెండు పరాజయాలు ఆమె కెరీర్ పై భాగానే ప్రభావాన్ని చూపాయి. ఎంతలా అంటే ఆ ఫ్లాపుల తరవాత అవకాశాలు బాగా తగ్గాయి.

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ‘పంతం’. గోపించంద్ హీరోగా కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 5న విడుదలకానుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే మెహ్రీన్ కెరీర్ గాడిలో పడి ఆఫర్లు మొదలవుతాయి. అందుకే ఆమె ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది. మరి ఆమెకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు