అక్షయ్ మిషన్ మంగళ్ వసూళ్ళలో ఆకాశాన్ని తాకింది

అక్షయ్ మిషన్ మంగళ్ వసూళ్ళలో ఆకాశాన్ని తాకింది

Published on Sep 13, 2019 6:50 PM IST

గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదలైన మిషన్ మంగళ్ రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. ఇస్రో మార్స్ గ్రహం పై విజయవంతంగా ప్రయోగించిన మంగళ్ యాన్ అంతరిక్ష నౌక ఆధారంగా తెరకెక్కిన మిషన్ మంగళ్ మూవీ వసూళ్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలై నాలుగు వారాల రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 200కోట్ల వసూళ్లు సాధించింది.

విమర్శకుల ప్రశంలతో పాటు, ప్రేక్షకుల మన్ననలను పొందిన ఈ చిత్రం మొదటివారం ₹128.16 కోట్లు రెండవ వారం ₹49.95 కోట్లుమూడవ వారం ₹15.03 కోట్లు నాలుగవ వారం ₹ 07.02 కోట్ల వసూళ్లతో మొత్తంగా ₹200.16 కోట్లు రాబట్టింది. అక్షయ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ హెడ్ గా వ్యవహరించిన రాకేష్ ధావన్ పాత్రలో కనిపించగా, ఈ ప్రయోగంలో కీలక పాత్ర వహించిన మహిళల పాత్రలలో విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి పన్ను, నిత్యా మీనన్ నటించారు. ఈ చిత్రానికి జగన్ శక్తి దర్శకత్వం వహించగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు