కీరవాణి.. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఈ పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కీరవాణి సంగీతం అందిస్తే ఆ సినిమా సగం హిట్ ఖాయమైనట్టే అనే నమ్మకముంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ కీరవాణి తన సంగీతంతో ఎన్నో సినిమాల విజయలన్ని రెట్టింపు చేసిన సందర్భాలున్నాయి. ఇటీవల ఆయన చేసిన ‘బాహుబలి’ సిరీస్ అందుకు నిదర్శనం. కీరవాణి సంగీతం లేకుండా బాహుబలిని ఊహించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో పాలలో నీళ్లలా కలిసిపోయిన సంగీతం, చిత్రం ఏదైనా ఉందా అంటే అది బాహుబలి అనే చెప్పాలి.
అంతటి గొప్ప ప్రజ్ఞాశాలి కీరవాణి తాను సినిమాల్లో కొనసాగడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయని, ఈరోజు సాయంత్రం జరగనున్న ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ వేడుకలో తన రిటైర్మెంట్ పై స్పష్టమైన ప్రకటన చేస్తానని స్వయంగా తెలిపారు. రాజమౌళి స్థాయిని ఏ దర్శకుడూ అందుకోలేడని, ఆయనకు సినిమా పట్ల ఉన్న తపన అలాంటిదని అంటూ రాజమౌళి తర్వాత తన ఆశలన్నీ తన కుటుంబీకుడైన కాంచి మీదనే ఉన్నాయని అన్నారు.
అలాగే వేటూరిగారి మరణం, సీతారామ శాస్త్రిగారి అనారోగ్యంతో తెలుగు లిరిక్స్ మంచం పడ్డాయని, తన రిటర్మెంట్ తన కుటుంబానికి కూడా ఇష్టంలేదని కానీ రిటర్మెంట్ కు సమయం ఆసన్నమైందని అన్నారు. అలాగే తన సినీ జీవితంలోని ప్రముఖ వ్యక్తుల గురించి, తన విశిష్ట అనుభవాల గుంరించి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
The chances of me continuing are less and less as there are more and more brainless directories in Tollywood .
— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017
I will let my fans know with my tweet by 5.30 pm today-
About my continuing/ discontinuing.— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017