మణిరత్నం చిత్రం గురించి లక్ష్మి చెప్పిన వివరాలు

మణిరత్నం చిత్రం గురించి లక్ష్మి చెప్పిన వివరాలు

Published on Dec 17, 2011 7:07 AM IST

మంచు లక్ష్మి తమిల్ లో చేయబోయే చిత్రం ‘పూకడై’. పాత తరం హీరో కార్తీక్ (తెలుగు ప్రేక్షకులకు మురళి గా పరిచయం) తనయుడు గౌతమ్ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి తమిళ వాతావరణంలో తీయబోతున్నారు. నేను తమిళ అమ్మాయిగా నటించబోతున్నాను. ఈ పాత్ర నాకు చాలెంజింగ్ లాంటిది. జనవరి నుండి నేను షూటింగ్ లో పాల్గొంటాను. షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుశుస్తున్నాను. నేను తమిళంలో చేయబోయే మొట్ట మొదటి చిత్రం మణిరత్నం గారి డైరెక్షన్లో చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను రెండు నెలలే క్రితమే ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. వినగానే వెంటనే బాగా నచ్చేసింది. మీరు చేయబోయే మొదటి తమిళ చిత్రంలో డీ గ్లామరైసేడ్ పాత్రలో నటిన్చబోతున్నందుకు బాధగా లేదా అని పత్రిక విలేఖరులు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ నేను చేయబోయేది మణిరత్నం సినిమాలో. అంత గొప్ప అవకాశం నాకు దక్కడం కంటే ఇంకేం కావాలి అని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు