పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్

పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ పూర్తి చేసిన పూరి జగన్నాథ్

Published on Feb 14, 2012 8:04 PM IST

పవన్ కళ్యాణ్ తో పూరి చేస్తున్న చిత్రం “కెమెరామన్ గంగ తో రాంబాబు” పేరుని ప్రకటించి వారం కాకముందే తాజా సమాచారం ప్రకారం పూరి ఈ చిత్ర కథని పూర్తి చేసారు. అన్ని చిత్రాల లానే ఈ చిత్ర కథని బ్యాంకాక్ లో రాశారు. ఈ విషయాని బివీస్ రవి ట్విట్టర్ లో దృవీకరించారు. ” “కెమెరామన్ గంగ తో రాంబాబు” చిత్ర కథను పూరి జగన్ పూర్తి చేసారు ఈ చిత్రం పూరి జగన్ మరియు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది” అని బి వి ఎస్ రవి చెప్పారు. ఈ చిత్రం లో పూరి జగన్నాథ్ ఒక పాత్రికేయుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పూరి మరియు పవన్ పదకొండేళ్ళ తరువాత కలిసి చిత్రం చేస్తున్నారు. గతం లో వీరు చేసిన “బద్రి” భారీ విజయం సాదించింది. ఈ చిత్రం పై భారి అంచనాలున్నాయి. ఈ సంవత్సరంలోనే ఈ చిత్రం మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు