ప్రేమికుల రోజున “ఋషి” చిత్ర ప్రత్యేక ప్రదర్శన

ప్రేమికుల రోజున “ఋషి” చిత్ర ప్రత్యేక ప్రదర్శన

Published on Feb 13, 2012 11:00 PM IST

“ఋషి” చిత్ర ప్రచారం కొత్త తరహా లో చెయ్యబోతున్నారు. ఈ విషయమై దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రం చుసిన తరువాత ప్రేక్షకులు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కొన్ని చిత్రాలు చూసి వారి డబ్బు వృధా అయ్యింది అని బాధ పడుతున్నారు. ఇందువల్ల ఈ చిత్రం చూసాకే డబులు చెల్లించే విధంగా ఏర్పాటు చేసాం ఈ షో ప్రేమికుల రోజు సాయంత్రం ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శించబడుతుంది అని చెప్పారు. ఈ విధానం లో ప్రచారం చెయ్యటం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఇదే మొదటి సారి. ఈ చిత్రం విడుదలకి ముందు చిత్ర బృందం మొత్తం వారి అవయవాలను దానం చేస్తాం అని ప్రతిజ్ఞ చేసారు. అరవింద్ కృష్ణ మరియు సుప్రియ శైలజ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ ప్రసాద్ దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి డాన్ చంద్రన్ – స్నిగ్ధ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు