శ్రుతి హాసన్ కి క్షమాపణలు తెలిపిన తమిళ పత్రిక

శ్రుతి హాసన్ కి క్షమాపణలు తెలిపిన తమిళ పత్రిక

Published on Feb 15, 2012 10:11 PM IST

శ్రుతి హాసన్ ఎట్టకేలకు తమిళ ప్రత్రికతో జరిపిన పోరాటం లో గెలిచారు. గత నెలలో ఈ తమిళ పత్రిక శ్రుతి హాసన్ మరియు ధనుష్ లకు సంబంధం ఉందని ప్రచురించారు ఈ విషయమై ధనుష్ మరియు ధనుష్ భార్య ఐశ్వర్య ఖండించారు శ్రుతి ఒక మెట్టు ఎక్కి ఆ పత్రిక మీద ఒక ఫిర్యాదు నమోదు చేసింది ఒక నెల తరువాత ఆ పత్రిక వారు శ్రుతి కి క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై శ్రుతి ట్విట్టర్ లో ఈ విధంగా స్పందించారు “ఈరోజు నాకు చాలా ముఖ్యమయిన రోజు నా మేదేహ తప్పుడు కథనాలు ప్రచురించిన పత్రిక నాకు క్షమాపణలు చెప్పింది ఇప్పుడు అందరికి నిజం తెలిసి ఉంటుంది ” అని అన్నారు. ప్రస్తుతం శ్రుతి హసన్ హైదరాబాద్,చెన్నై మరియు ముంబై ల చుట్టూ తిరుగుతున్నారు. మరిన్ని తెలుగు చిత్రాలు చెయ్యటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు