త్వరలో తెలుగులో రాబోతున్న “వెట్టై”

త్వరలో తెలుగులో రాబోతున్న “వెట్టై”

Published on Jan 13, 2012 11:45 AM IST

 

లింగుస్వామి దర్శకత్వం లో వస్తున్న చిత్రం “వెట్టై” తెలుగు లో అనువదించబోతున్నారు. మాధవన్, ఆర్య, సమీరా రెడ్డి మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.యు.టి.వి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం లో జనవరి 14 న విడుదల కానుంది. చిత్రంలో నటీనటుల వల్ల చిత్రం మీద ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు లో అనువదించబోతున్నారు అదే సమయం లో హిందీ లో రీమేక్ చెయ్యబోతున్నారు. ఈ చిత్రం లో నటులందరు మన ప్రజలకి పరిచయం కావటంతో మంచి వసూళ్లు రాబడుతుంది అని అంటున్నారు. యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు