రిమేక్ కోసం నాగ చైతన్య ను సంప్రదించలేదు : యుటివి

రిమేక్ కోసం నాగ చైతన్య ను సంప్రదించలేదు : యుటివి

Published on Jan 9, 2012 10:33 PM IST

నాగ చైతన్య ను ఎటువంటి రిమేక్ కోసం సంప్రదించలేదు అని “యుటివి” సంస్థ చెప్పింది. గతం లో “డిల్లీ బెల్లీ” చిత్ర రిమేక్ కోసం నాగ చైతన్యను సంప్రదించినట్టు పుకారు నడిచింది.. “యుటివి” సంస్థ అధినేత అయిన ధనంజయ గోవింద్ ఈ వార్త వట్టి పుకారు అని తేల్చేసారు. ధనంజయ్ మాట్లాడుతూ “మేము డిల్లీ బెల్లీ చిత్రాన్ని రిమేక్ చేస్తున్నాం ఈ చిత్రానికి 20 అవార్డు నామినేషన్స్ వచ్చింది ఇది ఒక రికార్డు.కాని ఇంతవరకు ఒక్క నటుడుని కూడా సంప్రదించలేదు. డిల్లీ బెల్లీ చిత్రం కోసం ప్రముఖ నటులను సంప్రదించం అని వచ్చే పుకారులని నమ్మకండి” అని చెప్పారు. న్యూస్ డైలీ పత్రిక కూడా జయం రవి మరియు నాగ చైతన్య తో కన్నన్ దర్శకత్వం లో రిమేక్ చెయ్యనున్నారు అని ప్రచురించారు. ఈ ప్రకటనతో పుకారులన్నింటికి తెరపడింది. తెలుగు మరియు తమిళ రిమేక్ లో ఎవరిని తీసుకోనుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు