టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’(Mowgli) ఇటీవల బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ డైరెక్ట్ చేయగా రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించింది.
అయితే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1, 2026న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటించగా, వైవా హర్ష, కృష్ణ భగవాన్, మౌనిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.


