ఎంపీ బాలశౌరి కుమారుని నిశ్చితార్ధానికి హాజరైన చిరంజీవి దంపతులు..!

ఎంపీ బాలశౌరి కుమారుని నిశ్చితార్ధానికి హాజరైన చిరంజీవి దంపతులు..!

Published on Aug 31, 2021 12:50 AM IST

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్‌ నిశ్చితార్థం స్నికితతో నేడు హైదరాబాద్‌లో హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చాలా మంది రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. అయితే ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు కూడా ఈ వేడుకకు హాజరై నూతన దంపతులకు ఉంగరాలను అందించి వారిని ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 మంది ఎంపీలు, 100 మంది ఎంఎల్ఏలు పాల్గొన్నారు.

అంతేకాకుండా చాలా మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనా«ద్‌ రెడ్డి, మేకతోటి సుచరిత తదుతరులు పాల్గొన్నారు. ఇక నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్‌.గోపాల్‌రెడ్డి, రమేశ్‌వర్మ, త్రినాధరావు నక్కినలు, నిర్మాతలు కోనేరు సత్యనారయణ, మహేశ్‌ రెడ్డి, లగడపాటి శ్రీధర్, దాసరి కిరణ్‌కుమార్, విసు, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్‌ అగ్ర రచయిత బుర్రా సాయిమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు