మిస్టర్ మజ్ను’ టీజర్ తో వచ్చేస్తున్నాడు !

మిస్టర్ మజ్ను’ టీజర్ తో వచ్చేస్తున్నాడు !

Published on Jan 2, 2019 1:29 AM IST

అక్కినేని అఖిల్ మూడవ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం యొక్క టీజర్ విడుదల తేదీన ఖరారు చేసుకుంది. జనవరి 2వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ‘మిస్టర్ మజ్ను’ టీజర్ విడుదలవుంతుందని అఖిల్ ట్వీట్ చేశారు.

ఇక ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.

కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు