ఎట్టకేలకు నాగ్ ఫ్యామిలీ హైదరాబాద్ లో దిగింది?

ఎట్టకేలకు నాగ్ ఫ్యామిలీ హైదరాబాద్ లో దిగింది?

Published on Sep 7, 2019 11:30 PM IST

కింగ్ నాగార్జున ఈ ఏడాది తన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు.దానికి కారణం ఇది ఆయనకు ప్రత్యేకమైన 60 వ పుట్టిన రోజు కావడమే.దీని కొరకు నాగ్ కుటుంబ సభ్యులైన అమల, చైతు, అఖిల్, సమంతలతో పాటు మరికొందరితో కలిసి గత నెల 29 స్పెయిన్ వెళ్లారు. స్పెయిన్ లోగల ఐబిజా ద్వీపంలో వీరు వారం రోజులుగా ఆట పాటలలో మునిగి తేలారు.వారి వెకేషన్ కి సంబందించిన ఫోటో లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులకు ఆనందం పంచారు.

ఐతే నేడు నాగ్ ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ ముగించుకొని హైదరాబాద్ చేరారు. వీరు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి దొరకడంతో ఈ సంగతి ధ్రువీకృతం అయింది. వీరు నటిస్తున్న చిత్రాల చిత్రీకరణ కొరకే వీరు హాలిడేస్ ముగించుకొని వచ్చారు అని సమాచారం.చైతు సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల చిత్రంలో నటిస్తుండగా, సమంత శర్వా హీరో తెరకెక్కుతున్న 96 చిత్రంలో నటిస్తున్నారు.ఇక అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు