మరో చిత్రానికి శ్రీకారం చుట్టిన నాగశౌర్య !

మరో చిత్రానికి శ్రీకారం చుట్టిన నాగశౌర్య !

Published on Jun 24, 2018 7:58 PM IST


నాగశౌర్య ‘ఛలో’ చిత్రం చిన్న సినిమాల్లోకల్లా పెద్ద విజయమే సాధించింది. దాంతో మంచి జోష్ లో ఉన్న నాగశౌర్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా నాగ‌శౌర్య‌ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి రాజా కొలుసు దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాత వి.ఆనంద ప్ర‌సాద్ భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి దర్శకత్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ‘పైసా వ‌సూల్‌’ చిత్రం ఈ సంస్థనే నిర్మించింది.

కాగా హైద‌రాబాద్ లోని కూక‌ట్‌ప‌ల్లి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవస్థానంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలను జరుపుకుంది. ఈ పూజా కార్య‌క్ర‌మంలో నిర్మాత ఆనంద‌ప్ర‌సాద్ తో పాటు, హీరో నాగ‌శౌర్య త‌ల్లి దండ్రులు ఉషా బాల‌, శంక‌ర‌ప్ర‌సాద్ తదితరులు పాల్గొన్నారు. ఆగ‌స్టు నుంచి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలవ్వనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు