పీవీ సింధు కు నాగార్జున ఖరీదైన బహుమతి.

పీవీ సింధు కు నాగార్జున ఖరీదైన బహుమతి.

Published on Sep 14, 2019 10:24 PM IST

ఇటీవల జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి ఆ ఘనత సాధించిన మొదట భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక మంది క్రీడా, సినీ మరియు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ప్రశంసించడం జరిగింది. అలాగే పి.వి.సింధును రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమెను అభినందించిన సంగతి తెలిసిందే.

తాజాగా సింధుకూ హీరో నాగార్జున బీఎం డబ్ల్యూ కారును బహుకరించారు. అంతేకాదు ఫైనల్‌లో పి.వి.సింధూ కనబరిచిన పోరాట పటిమను నాగార్జున కొనియాడారు.తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పి.వి.సింధూకు నాగార్జున కారు తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొనడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు