
నిర్మాత నల్లమలపు బుజ్జి ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే తన నిర్మాణ సంస్థలో వచ్చిన ‘రేసు గుర్రం’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో బుజ్జి తన రాబోయే సినిమాలను అనౌన్స్ చేసాడు.
బుజ్జి తదుపరి సినిమాలలో ఒకటి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఉంటుంది. భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఈ విషయం కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమా కాకుండా సురేందర్ రెడ్డి నూతన నటీనటులతో తెరకెక్కించే సినిమాని నిర్మించనున్నాడు. అలాగే సునీల్ హీరోగా మరో సినిమాని నిర్మించనున్నాడు.

