ఎన్టీఆర్ నూరవ జయంతి కోసం బాలయ్య మహత్తర కార్యం.!

ఎన్టీఆర్ నూరవ జయంతి కోసం బాలయ్య మహత్తర కార్యం.!

Published on May 21, 2022 12:00 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంటే అంటే గుర్తుకొచ్చే పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు సినిమా కోసం గాని తెలుగు వారై కోసం గాని ఆయన చేసిన పూనుకున్న కార్యక్రమాలు కోసం తెలియనిది కాదు. మరి అలాంటి మహనీయుని నూరవ జయంతి వస్తుండగా ఆయన తనయుడు టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.

ఇది వరకు అయితే అసలు ఎవరూ ఎక్కడా విధమైన ప్లాన్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తాము చేస్తున్న ప్లానింగ్ ని వివరించారు. మరి ఈ నూరవ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకు మరియు నందమూరి అభిమానులకి ఒక లిఖిత పూర్వక వ్రాతలో తన మాటలు ఈ విధంగా తెలియజేసారు.

“అభిమానులకు.. తెలుగునేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి..నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి…

మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను..

మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలుపంచుకుంటుంది… మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు.. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను..

వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత.. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతులమీద ప్రారంభిస్తున్నాను.. 365రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈమహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను.. అని బాలయ్య అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు