డైరెక్టర్ కోసం మురికి కుంపలో నానీ, అమలా పాల్

డైరెక్టర్ కోసం మురికి కుంపలో నానీ, అమలా పాల్

Published on Mar 12, 2013 9:20 PM IST

nani-and-amala-paul

మన యాక్టర్లు చేసే రిస్కీ స్టంట్లకి కొదవే లేదు. అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ యాక్షన్ సీన్ల రిజల్ట్ అనేది మనం ఊహించలేము. చాలాసార్లు మన హీరోలు చేసే షాట్లు భాయంకరమైనవే కాకుండా వారికి ఇబ్బంది కలిగించేలా వారికి అసౌకర్యంగా ఉంటాయి. అలాంటిదే ఒకటి హైదరాబాద్లో నానీ అమలా పాల్ జంటగా నటించిన ‘జండాపై కపిరాజు’ అనే సోషల్ డ్రామా తరహాలో సాగే సినిమా షూటింగ్ స్పాట్లో జరిగింది. కె. ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. మురికి కాలవలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలని హీరో, హీరొయిన్లని దర్శకుడు అడగగా వాళ్ళిద్దరూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా నటించారంట.
“డైరెక్టర్ అడిగిన వెంటనే నానీ కాలువలో దూకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందులో దాదాపుగా 30నిముషాలు గడిపాడు. తను చాలావరకూ అందులో మునిగిపోయాడు. నేను కూడా తన పక్కన ఉండి నా భావాలను పంచుకోవడం చాలా కష్టంగా అనిపించిందని” అమలా పాల్ ట్వీట్ చేసింది. చివరకు అంతా సాఫీగానే ముగిసినా ఆ కంపుని వదిలించుకోవడానికి చాలా కష్టపడ్డారు. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో నానీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు . ‘జెండాపై కపి రాజు’ సినిమా ఆగస్ట్ లో విడుదల సిద్దమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు