దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఐతే, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, తాజాగా హీరో నాని ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ‘హిట్-3’ ప్రీరిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ.. ‘రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ఇంకో ఏడాదిలో రాబోతోందని, సినిమాను ప్రపంచమంతా చూసి తీరాల్సిందేనని హీరో నాని అన్నారు.
ఏదిఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.