‘నన్ను దోచుకుందువటే’ హీరోయిన్ కి బంపర్ ఆఫర్ !

‘నన్ను దోచుకుందువటే’ హీరోయిన్ కి బంపర్ ఆఫర్ !

Published on Sep 23, 2018 3:07 AM IST

నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు సరసన నాభ నటేష్ కథానాయికగా ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది. కాగా ఈ చిత్రం నిన్న ప్రేక్షకులకు ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో తొలిసారి కథానాయకిగా నటించిన నాభ నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఇంపార్టంట్ రోల్ లో కనిపించిన నాభ మంచి ప్రతిభను కనబర్చింది. ఈ సినిమాలో నాభని చూసిన వారు ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు,

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. నాభ తన తదుపరి తెలుగు చిత్రంలో ఇప్పటికే సంతకం చేసిందట. దర్శకుడు వి ఆనంద్ దర్శకత్వంలో రవి తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో నాభ నటేష్ హీరోయినా గా నటించనుంది. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. నిజంగా నాభకి ఇది బంపర్ ఆఫరే.. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక ఆమెకి స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయి.

ఈ చిత్రం డిసెంబర్ లో ప్రారంభం కానుందట. తమన్ సంగీతం అందిచనున్న ఈచిత్రంలో రవి తేజ డ్యూయెల్ రోల్లో నటించనున్నారు. ‘నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు