సెన్సార్ పూర్తి చేసుకున్న నీవెవరో !

సెన్సార్ పూర్తి చేసుకున్న నీవెవరో !

Published on Aug 21, 2018 5:08 PM IST


ఆది పినిశెట్టి హీరోగా, తాప్సీ పన్ను, రితికా సింగ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న థ్రిల్లర్‌ చిత్రం నీవెవరో. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో వస్తుండటం, రంగస్థలం తర్వాత ఆది నటిస్తోన్న చిత్రం కావటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మంచి బజ్ సృష్టించుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘U/A’ సర్టిఫై తో ఆగష్టు 24న గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఎంవీవీ సత్యనారాయణతో కలిసి కోన వెంకట్‌, హరినాథ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు, ఐతే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు