నీవెవరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజే !

నీవెవరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజే !

Published on Aug 15, 2018 9:42 PM IST

ఆది పినిశెట్టి , తాప్సి పన్ను, రితికా సింగ్ లు హీరో హీరోయిన్లు గా నూతన దర్శకుడు హరినాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం’నీవెవరో’. ప్రీ సెలబ్రేషన్స్ పేరుతో ఈనెల 18న వైజాగ్ లో జరిగే ఈవెంట్ తో ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ పతాకం ఫై ప్రముఖ డైలాగ్ రైటర్ కోన వెంకట్ నిర్మిస్తున్న ఈచిత్రం ఆగష్టు 24న ప్రేక్షకులముందుకు రానుంది.

వివైద్యమైన కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అచ్చు సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ కథా నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు