మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఓ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సెట్ లో మహేష్ – పూజా హెగ్డే ల మీద లవ్ సీన్లన్నీ తీసేసే విధంగా త్రివిక్రమ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.
ఐతే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోందని.. ఆ హీరోయిన్ పాత్రలోనే జాన్వీ కపూర్ ను ఫైనల్ చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐతే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని ఈ సినిమాని నిర్మిస్తోంది.