‘క్రాక్’ తరువాత.. ఫుల్ ఎంటర్ టైన్మెంటే !

‘క్రాక్’ తరువాత.. ఫుల్ ఎంటర్ టైన్మెంటే !

Published on Nov 23, 2020 1:00 PM IST

మాస్ మహా రాజా రవితేజ ‘క్రాక్’ సినిమా షూటింగ్ ని మొత్తానికి పూర్తి చేసి.. ప్రస్తుతం డబ్బింగ్ కూడా చెబుతున్నాడు. అయితే క్రాక్ తరువాత ఏ సినిమా చేయాలి ? ఏ డైరెక్టర్ తో చేయాలి అనే మీమాంసలో గత కొన్ని రోజులుగా రవితేజ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ మొదట రమేష్ వర్మకే ఫిక్స్ అయ్యాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం తన తరువాత సినిమాని రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ తో చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

కాగా ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు ఈ సినిమానే రవితేజ ముందు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండటం.. పైగా ఫుల్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా పై రవితేజ ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకువస్తోందట. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు