సూర్య ‘ఎన్జికె’ అనుకున్న సమయానికే విడుదల కానుందట !

సూర్య ‘ఎన్జికె’ అనుకున్న సమయానికే విడుదల కానుందట !

Published on Aug 12, 2018 10:01 PM IST


తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జికె’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ కొంచెం నెమ్మదిగా జరుగుతుందట దాంతో అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందించింది. అనుకున్న సమయానికి షెడ్యూల్ పూర్తి చేయలేకపోతున్నాం. కానీ ఈచిత్రాన్ని ఎలాగైనా దీపావళికి విడుదల చేస్తామని తెలిపింది. అందుకోసం చిత్ర టీం బాగా కష్టపడుతుందని ఈ సంధర్బంగా వివరణ ఇచ్చారు.

ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవిలు కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు