తుది దశకు చేరిన ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ షూటింగ్ !

తుది దశకు చేరిన ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ షూటింగ్ !

Published on Jan 19, 2019 4:14 PM IST


యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న కొత్త చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` షూటింగ్ తుది దశకు చేరుకుంది. మనిషి తన నీడతో యుద్ధం చేయాల్సిన పరిస్థితివస్తే ఎలా వుంటుందో అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అన్య సింగ్ కథానాయికగా నటిస్తున్నారు.

కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలకానుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా

ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ .. ఒక కొత్త పాయింట్ తీసుకుని ఎమోష‌న‌ల్ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. సందీప్ కిష‌న్ తొలిసారి న‌టిస్తోన్న హార‌ర్ చిత్ర‌మిది. మ‌నిషి శత్రువుతో యుద్ధం చేస్తాడు కానీ.. మ‌నిషి త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ఎలా ఎదుర్కొన్నాడ‌నేదే పాయింట్‌. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్‌ను హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నారు. హీరో హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించనున్నారు దీంతో సినిమా పూర్తవుతుంది“ అన్నారు.

నిర్మాత ద‌యా ప‌న్నెం మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు కార్తీక్ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు