“నిశ్శబ్దం” రిలీజ్ తో పాటు మరో హింట్ ఇచ్చారా?

“నిశ్శబ్దం” రిలీజ్ తో పాటు మరో హింట్ ఇచ్చారా?

Published on May 27, 2020 7:10 PM IST

ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగుంది ఉంటే మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ చిత్రం “నిశ్శబ్దం” చిత్రం థియేటర్స్ లో సందడి చేసి ఉండేది. కానీ అనూహ్యంగా పరిస్థితులు తారుమారు కావడంతో ఈ చిత్రం విడుదలకు బ్రేక్ పడింది.

దీనితో ఈ చిత్రం నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది అని రకరకాల స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి.కానీ వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ చిత్ర యూనిట్ ఈ తమ సినిమా థియేటర్ లోనే విడుదల అవుతుందని ప్రకటించారు.

అలాగే ఇప్పుడు మళ్ళీ దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని చెప్తూనే మరోపక్క ఓటిటి పై చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. తమ చిత్రం మొదట థియేటర్స్ లోనే విడుదల కాబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

అంటే తర్వాత కానీ లేదా చిత్రం మొదట థియేటర్స్ లో విడుదల కావచ్చిన కొద్ది సమయంలోనే ఓటిటి లోకి వస్తుంది అని చెప్పకనే చెప్పినట్టుంది. మరి ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగులో ఎంత త్వరగా విడుదలకు నోచుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు