నితిన్ భీష్మ మళ్ళీ కాసుల వర్షం కురిపించడం ఖాయం

నితిన్ భీష్మ మళ్ళీ కాసుల వర్షం కురిపించడం ఖాయం

Published on Apr 22, 2020 10:34 PM IST

హీరో నితిన్ కి 2020 సంవత్సరం బిగినింగ్ లోనే ఓ సూపర్ హిట్ అందించింది. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోషల్ కాన్సెప్ట్ టచ్ చేస్తున్న లవ్ అండ్ హ్యూమర్ ప్రధాన అంశాలతో దర్శకుడు తెరకెక్కించిన విధానం జనాలకు తెగనచ్చేసింది. ఇక రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఐతే థియేటర్స్ లో భీష్మ సక్సెస్ ఫుల్ రన్ కొనసాగుతుండగానే, కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ థియేటర్స్ నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ మూవీ నిర్మాతలకు లాభాలు పంచినప్పటికీ కొన్ని వసూళ్లను కోల్పోవడం జరిగింది. కాగా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఏప్రిల్ 25 నుండి అందుబాటులోకి తీసుకురానుంది. థియేటర్స్ లో మిస్సైన ప్రేక్షకులతో పాటు, లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉన్న జనాలకు భీష్మ బెస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం కలదు. కాబట్టి భీష్మ కాసుల వర్షం కురిపించడం ఖాయం అని అందరూ నమ్ముతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు