అతని ఫ్యామిలీకి అన్నీ తానై చూసుకుంటానన్న ఎన్.టి.ఆర్

అతని ఫ్యామిలీకి అన్నీ తానై చూసుకుంటానన్న ఎన్.టి.ఆర్

Published on Mar 18, 2013 7:35 AM IST

Baadshah
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నినా రాత్రి హైదరాబాద్లో ఘనం గా జరిగింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. ఆడియో విడుదల కార్యక్రమంలో ఎలాంటి అపశృతులు జరగకుండా ఉండాలని బండ్ల గణేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా అభిమానుల తొక్కిసలాటలో ఓ అభిమాని మరణించాడు. అది తెలిసి ఎంతో బాధకి లోనైన ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘ ఒకప్పుడు నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరని బాధ పడేవాన్ని కానీ ఇప్పుడు నాకు ఇంతమంది అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారందరినీ కలుసుకోవడానికి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు ఆ ఆనందం లేదు, ఎందుకంటే నా తమ్ముడు ఒకడు తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. దయచేసి ఎవరూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఇళ్ళకు చేరుకోవాలని కోరుకుంటున్నాను, మీ ఇళ్ళ దగ్గర మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఎదురుచూస్తున్నారు కావున క్షేమంగా ఇళ్ళకు చేరండి. అలాగే చనిపోయిన నా అభిమాని వరంగల్ వాడే అతని ఫ్రెండ్ నాకు బాగా తెలుసు ఈ సభా ముఖంగా చనిపోయిన నా అభిమాని కుటుంబానికి అన్నీ నేనే చూసుకుంటానని మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. ఆ కన్నతల్లికి కొడుకు లేని లోటును, పుత్ర శోకాన్ని నేను తీర్చలేకపోవచ్చు కానీ ఆ ఫ్యామిలీకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని’ కంటతడి పెట్టుకున్నారు.

బండ్ల గణేష్ అభిమాని కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ అమ్మా మా తప్పిదం వల్ల మీ అబ్బాయి చనిపోయాడు. మమల్ని క్షమించండి. మీ అబ్బాయి లేని లోటును మేము తీర్చలేకపోవచ్చు కానీ మీ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటాను. రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి 5 లక్షల రూపాయలు అందజేస్తానని’ ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు