మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా అక్టోబర్ లో విడుదలకానుందన్న తాజా సమాచారం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాని అక్టోబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ‘ఎవడు’ సినిమా అక్టోబర్ లో విడుదలకానుండడంతో చరణ్ నటించిన ‘జంజీర్/తూఫాన్’ సెప్టెంబర్ 6న విడుదల కావచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఎవడు’ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ను జారీచేయడం జరిగింది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం.
అక్టోబర్ లో విడుదలకానున్న ‘ఎవడు’?
అక్టోబర్ లో విడుదలకానున్న ‘ఎవడు’?
Published on Aug 6, 2013 2:51 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
- వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- మమితా బైజు ప్లేస్ లో మానస వారణాసి ?
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!


